అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ 27 మద్యం బాటిళ్లు స్వాధీనం

ఆనందపురం జనసేవ : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 27మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్థానిక  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి)    ఇన్స్పెక్టర్ వి.రామకృష్ట మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
ఆనందపురం మండలంలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ  తన సిబ్బందితో సోమవారం విస్తృత దాడులు నిర్వహించగా  మండలంలోని గొట్టుపల్లి గ్రామానికి చెందిన గండి మాన చంటి   వద్ద నుండి 12 (180ml) మద్యం సీసాలను అలాగే అదే గ్రామానికి చెందిన  గండి మాన రమణ వద్ద నుండి 15 (180ml) మద్యం సీసాలు తో   పట్టుకొని  ఇద్దరు వ్యక్తులను అరెస్టు  చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు . 

.ఈ దాడులలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఎస్ఐ పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు