అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ 20 మద్యం బాటిళ్లు స్వాధీనం

భీమునిపట్నం జనసేవ : 

            స్థానిక  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి)  సర్కిల్  ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రొఫెషన్ & ఎక్సైజ్ ఎస్ ఐ డి పద్మావతి తమ సిబ్బందితో కలిసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకోవడం జరిగిందని బుధవారం మీడియాకు తెలిపారు.
            దీనికి సంబంధించి  పి &ఈ ఎస్ఐ డి. పద్మావతి  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.   

తగరపువలస ప్రాంతానికి చెందిన చిల్లి సూర్యనారాయణ కుమారుడు చిల్ల వెంకట్ రావువద్ద నుండి 12   మద్యం సీసాలను అలాగే నీలం శెట్టి లేటు రాములు  కుమారుడు నీలం శెట్టి చిన్నయ్య వద్ద నుండి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిని పద్మనాభం మండలం కుర్రపల్లి గ్రామం వద్ద  ఇద్దరు ను అరెస్టు  చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు . .
 ఈ దాడులలో ఎస్ఐ పద్మావతి సిబ్బంది సీఐ వి రామకృష్ణ ఆదేశాల మేరకు  దాడులు నిర్వహించారన్నారు