వైసీపీ కీలక నేత మృతి, ద్రిగ్బంధంలో ముఖ్యమంత్రి జగన్

 *ఒంగోలు* : ప్రకాశం జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకులు దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. 

గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు​ పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 అనంతరం వైసీపీ లో చేరారు, పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.