దివ్యాంగుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన వికలాంగుల నాయకులు

ఈరోజు ఉదయం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో నూతనంగా జాయిన్ అయిన జిల్లా కలెక్టర్ గారు గౌరవ శ్రీ మల్లికార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిసి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విశాఖ జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు, కార్యదర్శి కె ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. 


( ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల నాలుగు శాతం రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలని అలాగే దివ్యాంగుల చట్టం 2016 పటిష్టంగా అమలు చేయాలని అలాగే స్థానిక సంస్థల్లో సుప్రీంకోర్టు కల్పించిన రాజకీయ ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేసి కో ఆప్షన్ నెంబర్ లాగా అవకాశం కల్పించాలని అలాగే దివ్యాంగులకు ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే దివ్యాంగులకు ఆయా మండలాల్లో గృహాలు మంజూరు చేసి, నిర్మించి ఇవ్వాలని అలాగే దివ్యంగా కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కాదు అందరికీ మంజూరు చేయాలని పలు సమస్యలు ను, ప్రభుత్వం దృష్టికి గౌరవ కలెక్టర్ గారు తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు

రవి కిషోర్